Breaking News

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం… రాష్ట్ర ఉత్సవంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం రాష్ట్ర ఉత్సవంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం ఏ కన్వెన్షన్‌ సెంటర్‌కు బయలుదేరి వెళ్తారు. కాగా, అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు పాల్గొంటారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *