Breaking News

ఎమ్మెల్యే డా. మొండితోక.జగన్ మోహన్ రావు చే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

తెలుగు తేజం, నందిగామ :నందిగామ పట్టణంలో 8 వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.20 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే డా. మొండితోక.జగన్ మోహన్ రావుఅధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నందిగామ పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నందిగామ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని నేడు సీఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *