Breaking News

ఎల్లారెడ్డిలో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంగళవారం ఉదయం చిన్నారి అదృశ్యమైన అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. బుధవారం ఉదయం గ్రామసమీపంలోని నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతులకు మూడవ కుమార్తె అయిన సౌమ్య(2) మంగళవారం ఉదయం ఇంటిముందు అడుకుంటూ కనిపించకుండాపోయింది. కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినప్పటికి జాడ తెలియకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి డాగ్‌స్వ్కాడ్‌తో వెతికినప్పటికీ అచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే బుధవారం చిన్నారి మృతదేహాన్ని నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో స్థానికులు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడే చేరుకుని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు.చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై శ్వేత తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *