Breaking News

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

ముంబయి: రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో రాయిగఢ్‌, ముంబయి పోలీసులు ఓ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. ఏపీఐ సచిన్‌ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుంది. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అర్ణబ్‌పై ఐపీసీ సెక్షన్‌ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అర్ణబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ టీఅర్పీ రేటింగ్స్‌ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *