Breaking News

కన్నుల పండుగగా ఆది దంపతుల గిరి ప్రదక్షిణ

తెలుగు తేజం, విజయవాడ : కార్తీక పౌర్ణమి సందర్బంగా సోమవారం ఇంద్రకీలాద్రి ఫై వేంచేసి ఉన్న పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులను దుర్గమ్మ ప్రచార రథం లో కనుల పండుగగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు మల్లిఖార్జున మహామండపంలో అమ్మవారి ప్రచార రథం వద్ద ఆలయ ఈవో ఎం.వి.సురేశ్‌బాబు, పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధానార్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, వైదిక కమిటీ సభ్యులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా దుర్గమ్మ ప్రచార రధం లోకి రుత్వికులు తీసుకువచ్చారు.అనంతరం కాలినడకన గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. మహామండపం నుంచి కనకదుర్గానగర్‌, కుమ్మరిపాలెం సెంటర్‌, సితార సెంటర్‌, చిట్టినగర్‌, పాల ఫ్యాక్టరీ, బ్రాహ్మణవీధి, రథం సెంటర్‌ మీదుగా తిరిగి మహామండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దారిపొడవునా భక్తులు ప్రచార రథంలో కొలువుదీరిన ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు భక్తిశ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ నిర్వహించాలని దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నందున ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వేదపండితులు, అర్చకులతో పరిమిత సంఖ్యతోనే గిరి ప్రదక్షిణ చేశామని, కరోనా ముప్పు తొలగిపోతే వచ్చే ఏడాది నుంచి ఏటా వేలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం ఈవో సురేశ్‌బాబు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *