Breaking News

కానూరులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

తెలుగు తేజం, పెనమలూరు : కృష్ణ జిల్లా, పెనమలూరు మండలం కానూరు గ్రామా పంచాయితీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పంచాయతీ కార్య నిర్వహణాధి కారి సి వి ఎల్ ఎస్ ఆర్ వి ప్రసాద్ ఆధ్వరంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కానూరు గ్రామపంచాయతీలో పరిధిలో అవసరమైన మేరకు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని దానిలో భాగంగానే గ్రామపంచాయితీ ఆఫీస్ ఎదురుగా గల ఈ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డు మొత్తం 125 మీటర్ల పొడవున రూ 6.8 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ నిధులు 2020-2021 ఆర్ధిక సంవత్సరం నిధుల నుండి ఈ మొత్తాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్య నిర్వహణాధికారి ప్రసాద్ తో పాటు కాంట్రాక్టర్ మహమ్మద్ సిద్దిఖ్యూ గ్రామా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *