Breaking News

కీసర మున్నేటి వాగులో ఈతకెళ్లి ఐదుగురు గల్లంతు.. ముగ్గురు మృతి

నందిగామ : మున్నేరు వాగు మరోసారి బలి తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం కీసర వద్ద మున్నేరు వాగులోకి ఈత కోసం దిగి ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా.. ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర మున్నేటి వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వచ్చి నీళ్లలోకి దిగిన వ్యక్తులు లోతు గుర్తించక ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమీపంలోని స్నేహితులు చూసి కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న స్థానికులు రక్షించేందుకు ప్రయత్నం చేశారు. మున్నేటి నుండి ఐదుగురు వ్యక్తులను స్థానికులు అతి కష్టమ్మీద బయటకు తీశారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు అప్పటికే మృతిచెందగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని.. యువకులకు ప్రాథమిక వైద్య చికిత్సలు అందిచి.. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ కోసం విజయవాడకు తరలించారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *