Breaking News

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించిన తెలుగుదేశంపార్టీ గన్నవరం ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహస్వామి యాగం ఆదివారం కానురులోని యార్లగడ్డ గ్రాండియర్లో నిర్వహించారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుందని తెలిపారు. నేపాల్ కు చెందిన రుత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *