Breaking News

కోవిడ్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

తెలుగు తేజం, విజయవాడ : విజయవాడలోని గూడవల్లి ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి కరోనా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా అందిస్తున్న పౌష్టికాహార నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. కరోనా బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్ల ఫిట్నెస్ కోసం నిర్వహిస్తున్న యోగా క్లాసులను ఆయన పరిశీలించారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేషెంట్లను చూసుకోవాలని కలెక్టర్ వైద్య అధికారులకు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *