Breaking News

క్యాన్సర్ అవేర్‌నెస్ నెలగా అక్టోబర్: ఏపీ డీజీపీ

విజయవాడ: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ వర్చ్యువల్ రన్ 2020ను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది చాలా ఉపయుక్తమైన రన్ అని.. శారీరక ధృఢత్వానికి చాలా అవసరమని పేర్కొన్నారు. క్యాన్సర్‌ గురించి అవగాహన చాలా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్‌ను ప్రారంభ స్ధాయిలోనే గుర్తించాల‌ని తెలిపారు. క్యాన్సర్‌ అవేర్‌నెస్ నెలగా అక్టోబర్ ఉంటుందని అన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ మంది ఈ రన్‌లో పాల్గొనడం ద్వారా గిన్నీస్ రికార్డు రావాలన్నారు. అందరం ఈ రన్‌లో పాల్గొనడం చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. ఎక్కడ ఉన్నా రన్‌లో పాల్గొని 5 సెకండ్స్ వెబ్ లింక్‌లో అప్‌లోడ్ చేసి మద్దతు తెలపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *