Breaking News

క్రైస్తవ నాయకులు ఆధ్యాత్మిక చింతన మరియు సామాజిక స్పృహ కలిగి ఉండాలి – డాక్టర్ ముల్లర్

తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడు మండలం ముప్పాళ గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరమునందు నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ చందర్లపాడు మండల కార్యవర్గ సమావేశము కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు కొండూరు హనోకు అధ్యక్షతన జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జార్జి ముల్లర్ చందర్లపాడు మండల కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జయంతిరావు, అధ్యక్షుడుగా యస్. రవి కుమార్, ప్రధాన కార్యదర్శిగా వై వినీల్ కుమార్, కోశాధికారిగా దేవరాజు, ఉపాధ్యక్షులుగా కొండ్రు యేసు,కోట షాలేమ్,యస్. రమేష్,సహాయక కోశాధికారి మహేష్ తదితరులను ప్రకటించినారు. అనంతరం కృష్ణాజిల్లా కోశాధికారి కె పాల్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ “2020 వ సంవత్సరంలో నిర్వహించనున్న అన్ని సెమీ క్రిస్మస్ వేడుకలను అత్యంత జాగ్రత్తతో ప్రభుత్వ నిబంధనలకు లోబడి, కొవిడ్-19 నిబంధనలకు తగినట్లుగా సామాజిక దూరాన్ని పాటిస్తూ నిర్వహించాలని, అదేవిధంగా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించాలని” తెలియజేశారు. నియోజకవర్గ సేవకులందరిని కలిపి “గ్రాండ్ క్రిస్మస్-2020” నిర్వహించనున్నట్లు ప్రకటించినారు. ఈ సమావేశంలో ప్రవీణ్,స్పర్జన్, యేసు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *