Breaking News

జగ్గయ్యపేట హైవే బస్టాండ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం… ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

తెలుగు తేజం , జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారి వద్ద హైవే బస్టాండ్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు తెలిపారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని నేషనల్ హైవే 65 వద్ద రూ. 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న హైవే బస్టాండ్ స్థలాన్ని ఏపిఎస్ ఆర్టీసీ సీఈ శ్రీనివాస్, జగదీశ్వరావు ఆర్ఎంవో నాగేంద్ర ప్రసాద్ గార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే బస్టాండ్ నిర్మాణానికి డిజైన్ ఫైనల్ చేయడం జరిగిందని తెలిపారు. త్వరితగతిన హైవే బస్టాండ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *