Breaking News

గిరిజన సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతేకశ్రద్ద చూపుతుంది- మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

తెలుగు తేజం, మైలవరం : మైలవరం లోని సాయిబాబు కళ్యాణ మండపం లో సోమవారం రాత్రి గిరిజన సంక్షేమశాఖ అద్వర్యంలో గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీ పై తైవాన్ స్పేయర్ ల పంపిణి కార్యక్రమం జరిగింది.జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ , గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కలసి కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు పాల్గొని నియోజకవర్గ పరిదిలోని 150 మంది గిరిజన రైతులకు తైవాన్ స్పైయర్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ.అడిగిన వెంటనే స్పందించిన కలెక్టర్ గిరిజన సంక్షేమశాఖ అధికారులు రైతులకు పెద్ద ఎత్తున తైవాన్ స్పైయర్ లు పంపిణి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గం లో రూ 2 కోట్ల యస్ టి సబ్ ప్లాన్ నిధులతో త్వరలో అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ,గిరిజన సంక్షేమశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *