Breaking News

గుర్రాజుపాలెం గ్రామంలో సమగ్ర రీ సర్వే ప్రారంభం

తెలుగు తేజం, కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామంలో సమగ్ర రీ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తమటం వెంకట్రామయ్య (బద్రి) ప్రారంభించారు. ఈ సందర్భంగా తమటం వెంకట్రామయ్య (బద్రి) మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూహక్కు భూ-రక్ష పథకం పేద రైతులకు,ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగమన్నారు. ఇప్పటివరకు రైతులు తమ పొలాలకి సంబందించిన పాసబుక్,రిజిస్ట్రేషన్ కాగితాలు,అడంగల్ లో ఏమైనా తప్పులు ఉంటే కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇప్పుడు ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెదలకి ఉచితంగా హక్కు పత్రాలను ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పూర్తితో రైతులకు విశేష సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని పరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఇంతియాజ్ పాషా, మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్స్,వి ఆర్ ఓ లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *