Breaking News

ఘనంగా మహిమ సాయిబాబా సంస్థాన్ ద్వితీయ వార్షికోత్సవాలు

తెలుగు తేజం, కంచికచర్ల (ప్రతినిధి) : కంచికచర్ల పట్టణంలోని మోడల్ కాలనీలో శ్రీ మహిమ సాయిబాబా సంస్థాన్ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు కాగడ హారతి 6 గంటలకు పంచామృతాభిషేకం ఎనిమిది గంటలకు గణపతి హోమం మధ్యాహ్న హారతి నిర్వహించినట్లు ఆలయ అర్చకులు రామకృష్ణారావు తెలియజేశారు. వివిధ రకాల పూలమాలలతో స్వామి వారిని అలంకరించారు. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి భక్తుల సహాయ సహకారాలతో వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కి విశేషమైన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే సాయంత్రం ఏడు గంటలకు పల్లకిసేవ ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *