Breaking News

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు : వంగవీటి రంగా రావు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : భారతీయ జనతా పార్టీ జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షులు వంగవీటి రంగ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అని భారతీయుల గుండెల్లో దేశభక్తిని నింపిన సుభాష్ చంద్రబోస్ 125 వ నేతాజీ జయంతి సందర్భంగా నేతాజీ జీవితం ఎందరికో ఆదర్శం అంటూ అమర విరుడుని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి కొడాలి అపర్ణామల్లికార్జున్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భారత మాత ముద్దు బిడ్డ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ జపాన్ జర్మనీ తదితర దేశాల్లో ఉంటు భారత స్వాంత్య్రోద్యమంలో స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధానకార్యదర్శి గోలి రాఘవేంద్రరావు రేవూరి జగన్మోహనరావు మెడురి వెంకటేశ్వర రావు పసుపులేటి శ్రీకృష్ణ బొగ్గవరపు రామకృష్ణ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *