Breaking News

చంద్ర బాబు నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలి : మల్లాది విష్ణు

తెలుగు తేజం, విజయవాడ : సీఎం వైఎస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేస్తు‍న్నారని, చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదల ఒకటో డివిజన్‌లో ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకి బుద్ధి రాలేదని, పేద ప్రజలకు ఉచిత ఇల్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు అడ్డుకున్నాడని మండిపడ్డారు. విజయవాడలోని పేద ప్రజలకు 12,500 మందికి ఇల్లు ఇస్తామని లక్షల రూపాయలు వసూలు చేసిన చరిత్ర టిడిపిదని గుర్తుచేశారు. అచ్చం నాయుడు, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపు విషయంలో టీడీపీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారని, టిడిపి నేతలు చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని, అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *