Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష పై రివ్యూ

నూజివీడు : నూజివీడు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై అధికారులతో బుధవారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం డి ఓ పి శంకరరావు మాట్లాడుతూ మండలంలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 ఎల్ ఎస్ సెంటర్లు ఉన్నాయని వాటి ద్వారా వచ్చే నెల నాలుగవ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అధికారులు నిర్విఘ్నంగా కొనసాగించాలన్నారు. విధి నిర్వహణలో, కార్యక్రమం అమలు తీరులో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *