Breaking News

నెల్లూరు జిల్లా లో జరగ బోయే రాష్ట్ర మహా సభలను విజయవంతం చెయ్యాలి : ఏ ఐ ఎస్ ఎఫ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ : AISF అధ్వర్యంలో ఈరోజు నాగార్జున విశ్వవిద్యాలయంలో నెల్లూరు జిల్లా లో జరగ బోయే రాష్ట్ర మహా సభలకు సంబంధించి సమావేశం లో విద్యార్దులు అందరూ పాల్గొన్ని విజయ వంతం చెయ్యాలని తీర్మానం చేశారు.ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ AISF అధ్యక్షులు నాసరయ్య మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్ది ఉద్యమం కీలకంగా మారనుందని, రేపటి భవిష్యత్ తరాల కోసం విద్యార్థులూ సమిదలై దేశ అభివృదిలో పాటు పడాలని విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో జాతీయ విద్యా విధానం పై విద్యా వైద్య యువతకు ఉపాధి మరియు సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు తదితర అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు,లేనిపక్షాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి విద్యార్థిలు విద్యార్థి సంఘాలు గా సిద్ధమని హెచ్చరించారు .సమావేశంలో ప్రధాన కార్యదర్శి అవినాష్,కార్యదర్శి చైతన్య నాయక్, సునీల్, మధు, వాగ్యా నాయిక్, రాధ కృష్ణ, రవి తేజ, రఘు,తది తర విద్యార్ధిని విద్యార్థులూ పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *