Breaking News

జగ్గయ్యపేటలో ముదిరాజ్ ఆత్మీయ సన్మాన సభ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలోని మున్సిపల్ టౌన్ షిప్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కొర్న వెంకట నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పూలమాలలు, శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కొర్న వెంకట నారాయణ, కార్పొరేషన్ డైరెక్టర్ లకు పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *