Breaking News

జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా ఇద్దరికి తీవ్ర గాయాలు

తెలుగు తేజం,కంచికచర్ల (ప్రతినిధి) :కంచికచర్ల మండలంలో కీసర బి జె టీ స్కూల్ జాతీయ రహదారిపై 12 మందితో ప్రయాణిస్తున్న తుఫాన్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురుకు స్వల్ప గాయాలు అవ్వగా ఇద్దరికి తీవ్ర గాయాల పాలు అయ్యారు. ప్రమాద భాదితులను 108 సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంవల్ల ఒక్కసారిగా తుఫాన్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వ్యాన్ లోవున్న 12 మంది రైతులు గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామంలో పత్తి పంట పొలాలను పరిశీలించి తిరిగి తమ స్వగ్రామమైన కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి వెళుతుండగా కీసర వద్ద ప్రమాదం జరిగిందని అని డ్రైవర్ తెలిపాడు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *