Breaking News

తెలుగుదేశం పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుందాం

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య..

తెలుగు తేజం, నందిగామ (ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుందామని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకాని నగర్ నందు గణపతి దేవాలయంలో తెదేపా నేతలతో కలిసి ప్రతేక్య పూజలలో తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిని శ్రీమతి శాఖమూరి స్వర్ణలత మరియు 13వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్ధిని శ్రీమతివేపూరి ఉషారాణితో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ,సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడం ద్వారా వ్యవస్థల బలోపేతానికి, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *