Breaking News

డాక్టర్ జార్జి ముల్లర్ కు 2021 జాతీయ పురస్కారం

తెలుగు తేజం, కంకచర్ల : హ్యూమన్ కేర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నందు జాతీయ పుష్కరాల వేడుకలు జరిగినాయి . ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎ. జోసెఫ్ చేతుల మీదగా వివిధ రంగాలలో విశేష కృషి చేస్తున్న సామాజిక సేవకులకు,
సాహితీవేత్తలకు,ఆధ్యాత్మిక నాయకులకు పురస్కారాలు అందజేశారు. ఆధ్యాత్మిక విభాగంలో సేవలందిస్తున్న నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొక్కా జార్జి ముల్లర్ కు బెస్ట్ స్పిరిచువల్ లీడర్ నేషనల్ అవార్డు – 2021 అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ముల్లర్ మాట్లాడుతూ అవార్డ్స్ రావడం బాధ్యతను పెంచుతున్నాయని,ఇంకా ఎక్కువగా సామాజిక, ఆత్మీయ,ఆధ్యాత్మిక రంగాల్లో కృషి
చేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ పాల్,ఎన్సీసీ నాయకులు డాక్టర్ ఉషా కిరణ్,డాక్టర్ శామ్యూల్ శేఖర్, డాక్టర్ బాలు,డాక్టర్ ఘంటా విజయ్ కుమార్, మట్టా ప్రసాద్,పాల్ శంకర రెడ్డి,హానోకు, జక్రయ్య,కోటా రాంబాబు తదితరులు ముల్లర్ ను అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *