Breaking News

డాక్యుమెంట్లు, ఈసీలు, సెర్చ్ రిపోర్టులతో సహా ఇక ఉచితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు…

తెలుగు తేజం, అమరావతి: రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీలు, ఎన్ కంబరన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), సెర్చ్ రిపోర్టులు ఇకనుంచి ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఒక డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీ కావాలంటే సుమారు రూ.300, ఈసీ కావాలంటే రూ.220 చెల్లించాల్సి వచ్చేది సెర్చ్ రిపోర్టుకు కూడా కొంత రుసుం కట్టాలి. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇక మీదట ఇవన్నీ ఉచితంగానే పొందవచ్చు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈసీలు, సెర్చ్ రిపోర్టులు గతంలోనూ ఆన్ లైన్ లో ఉచితమే అయినా.. సబ్ రిజిస్ట్రార్ కు దరఖాస్తు చేసుకుంటే మాత్రం రుసుం కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అది కూడా చెల్లించా ల్సిన అవసరం లేదని, అన్నీ ఉచితమేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *