Breaking News

తెలుగుతేజం దినపత్రిక వెబ్ సైట్ రూప కర్త – రమేష్ బాబు ఇక లేరు

తెలుగుతేజం, రాజంపేట(కడప): తెలుగుతేజం దినపత్రిక వెబ్ సైట్ రూపకర్త రమేష్ బాబు కలిశెట్టి ఇక లేరు అనే వార్త ఎంతో బాధ కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం 5.30 గంటల సమయంలో కండరాల క్షీణత వ్యాధితో తుది శ్వాస విడిచారు. మంచి మనిషి, మృదు స్వభావి, అందరిని కలుపుకు పోయే మనసత్త్వం వున్న మనిషి రమేష్ బాబు. గొప్ప స్నేహశీలి, సేవా గుణం కలిగి ఉన్న రమేష్ ను కోల్పోవటం ఎంతో విచారకరం. అయన కండరాల క్షీణత వ్యాధితో బాధ పడుతూనే, ఆ వ్యాధి ఉన్న ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసేవారు. నిరంతరం కండరాల క్షీణత వ్యాధి గురించి అనేక అన్వేషణలు చేసేవారు. ఆ వ్యాధి నయం కోసం అనేక దేశాల వైద్యులతో మాట్లాడి సమాచారం తెలుసుకొని తన తోటి పీడితులకు అందించేవారు.

ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆయన కుటుంబానికి తెలుగు తేజం దినపత్రిక తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం. జోహార్ రమేష్ బాబు..
కేతన సత్యనారాయణ

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *