Breaking News

ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ చర్యలు

తెలుగు తేజం , అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 3.61లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారన్నారు. సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *