Breaking News

నందిగామలో ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభకు వైసీపీ నాయకుడు నరసింహారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

తెలుగు తేజం, నందిగామ : నందిగామలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు స్థానిక వైసీపీ నాయకుడు నరసింహారావు ఆధ్వర్యంలో కంచికచర్ల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. నందిగామలో చివరి రోజైన అమ్మ పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని ), పేర్ని వెంకట్రామయ్య(నాని ), వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆటోలు, బైక్ ర్యాలీలతో కార్యకర్తలు తరలి వెళ్లారు. కంచికచర్ల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై జగన్, జై జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా సాగింది. ర్యాలీ అగ్రభాగాన నన్నపనేని నరసింహారావు, కాలవ వెంకటేశ్వరరావు ( పెదబాబు), నన్నపనేని అజయ్ కుమార్, ఉస్తేల నరసింహారావు, జనరంజని నరసింహారావు, పోపూరి నాయుడయ్యా, తోట వెంకట బేబీ, కర్నాటి శ్రీనివాసరావు, శీలంనేని నాని, టైలర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *