Breaking News

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదు

ఇబ్రహీంపట్నం మండల ఫిలోషిప్ దైవ సేవకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టిన క్రైస్తవ సంఘాల సభ్యులు

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వాఖ్యలు మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని, ఇబ్రహీంపట్నం మండల ఫిలోషిప్ దైవ సేవకుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వం గా యావత్ దేశం నడుస్తున్న నేపథ్యంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని ఇబ్రహీంపట్నం మండల క్రైస్తవులు బగ్గుమన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండల ఫీలోషిప్ క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మానవ సమాజంలో మార్పు కోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేసే క్రైస్తవుల పై ఇలాంటి వాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మత సామరస్యానికి పునాదులు వేయాల్సిన వారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా చేసిన వాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *