Breaking News

నందిగామలో ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ..

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డా”మొండితోక అరుణ్ కుమార్ ..

తెలుగు తేజం, నందిగామ : యావత్ దేశం మొత్తం తన వైపు చూసేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు ,

వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం పట్టణంలోని గాంధీ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ,పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 కేజీల భారీ కేకును కట్ చేసి, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు , అనంతరం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి జన్మదిన కేక్ కట్ చేశారు , ఈ సందర్భంగా డా”అరుణ్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీపడి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు ,దివంగత నేత ఆశయాలే లక్ష్యంగా ప్రతి ఒక సామాన్యుడికి న్యాయం చేయాలనే సంకల్పంతో జననేత జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ దిశగా పనిచేస్తూ ప్రజా మన్ననలు పొందుతున్నారని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తన పాలనతో దేశానికి మార్గదర్శకమవుతూ పరిపాలనా దక్షకునిగా నీరాజనాలు అందుకుంటున్న సంక్షేమ సారధని కొనియాడారు . ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ,మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *