Breaking News

నందిగామ మున్సిపాలిటీ పై వై సీ పీ జెండా ఎగురవేస్తాం : డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

తెలుగు తేజం, నందిగామ (ప్రతినిధి) : నందిగామ పట్టణంలోని 17వ వార్డు నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు – 50 కుటుంబాలు .. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు
పార్టీలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర నాయకులు డా. అరుణ్ కుమార్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు చేసిన అభివృద్ధే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని తెలిపారు , ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 90% వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన కు ప్రజలంతా ఓట్లు వేసి తమ అభిప్రాయాన్ని తెలిపారన్నారు. పార్టీలో చేరిన వేటగిరి నాగేశ్వరరావు, ఇళ్ళ శివ, తుపాకుల శివాజీ, వెంకటేశ్వరరావు, చలమల రాజశేఖర్ ,కోటయ్య ,ఏకసిరి అంకమ్మరావు, చలమల లక్ష్మి ,వేటగిరి లక్ష్మి ,రోశమ్మ మరియు 50 కుటుంబాలకు పార్టీ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు ,ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ మస్తాన్, మండవ పిచ్చయ్య ,దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాములపాటి రమేష్ ,వార్డు ఇన్చార్జి పట్టా శీను ,అభ్యర్థి సాంబయ్య ,నాగరాజు, విజయలక్ష్మి, బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *