Breaking News

వార్డుల్లో ప్రారంభమైన అభివృద్ధి పనులు

తెలుగు తేజం, కంచికచర్ల (ప్రతినిధి) : శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆదేశానుసారం సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు ఉపసర్పంచ్ వేమా సురేష్ బాబు సూచనలు మేరకు 9,10, 13వవార్డు సభ్యులు గ్రంధి ఆదిత్య షేక్ కరీమున్ ఉప్పు వెంకట స్వామి రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని గ్రామంలో బోర్ పంపులపై దృష్టి సారించారు. కొత్త గా ఎన్నికైన వార్డు సభ్యుడు వారి వార్డు లలో సమస్యలపై దృష్టి సారించారు. 9 10 13వ వార్డులలో పనిచేయని బోర్ పంపులను ఆర్ డబ్యుఎస్ సిబ్బంది తో మరమ్మతులు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండ వార్డు లో ఉన్న చెత్త ను కంపచేట్లు, పిచ్చి మొక్కలు తీయించే పనిని చేపట్టడం జరిగింది.స్థానిక హనుమాన్ పేట, లలో బోరు పంపులు మరమ్మతులకు గురయ్యాయి,కొంత కాలంగా బోర్ పంపులు పనిచేయక పోవడంతో ప్రజలు నీటి వాడకానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో 3వ సెగ్మెంట్ వైసిపి అభ్యర్థి వేమా రోజ రమణి 4వ సెగ్మెంట్ వైసిపి అభ్యర్థి గుగులోతు ఇందిరా శివ నాయక్ లతో కలిసి సమస్యల పై దృష్టి సారించారు, మంచినీరు సరఫరా, మురికి కాలువలు తీయించడం, బోర్ పంపులను బాగు చేయించడం పై ప్రజా ప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా 9,10, 13వ వార్డు నెంబర్స్ గ్రంధి ఆదిత్య షేక్ కరీమున్ ఉప్పు స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు ఉపసర్పంచ్ వేమా సురేష్ సహకారంతో 9,10 13వ వార్డు ను మరిన్ని అభివృద్ధి పనులు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *