Breaking News

నూతన సర్పంచ్ వేల్పుల పద్మకుమారి దంపతులను సత్కరించిన పాత్రికేయులు

తెలుగుతేజం, పెనుగంచిప్రోలు : గ్రామంలో
నూతన సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా
వేల్పుల పద్మ కుమారి దంపతులను పాత్రికేయులు ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు వేల్పుల పద్మ కుమారి దంపతులను శాలువాతో సత్కరించి,పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
వేల్పుల పద్మ కుమారిమాట్లాడుతూ పెనుగంచిప్రోలు గ్రామ అభివృద్ధి కొరకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజల సహకారంతో పాటు పాత్రికేయుల సహకారం కూడా ఎంతో అవసరమని, అందరం భాగస్వాములై గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమ పంచాయతీ గా తీర్చిదిద్దడంలో సహకరించాలని కోరారు. వేల్పుల రవికుమార్ మాట్లాడుతూ
పాత్రికేయులు విలువలతో కూడిన జర్నలిజం చేయాలని,శాస్త్రీయ పద్ధతిలో వార్తలు రాసి అందరి మన్ననలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పెనుగంచిప్రోలు మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చేని రాంబాబు,తోటకూర కోటేశ్వరరావు,పెనుగంచిప్రోలు మండలం ప్రెస్ క్లబ్ సెక్రటరీ దండా రామకృష్ణ, అంగజాల శ్రీనివాస్, బూర యశ్వంత్, పత్తిపాటి నాగబాబు, సాయి,బాణావతు రాంబాబు,పూర్ణ కంటి మార్క్, పూర్ణ గంటి వెస్లీ, పులగం శివరామకృష్ణ, బానావత్ సురేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *