Breaking News

నేడు మచిలీపట్నానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

తెలుగు తేజం, అమరావతి : జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు రానున్నారు. ఉదయం 11:35 కు ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం వద్ద నుండి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడినుంచి 12:05 కు బయలుదేరి ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తిరిగి 12:45 కు మంత్రి నివాసం వద్ద నుండి బయలుదేరి తాడేపల్లి సీఎం నివాసం చేరుకుంటారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *