Breaking News

పంచతత్వ పార్కును ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: నగర ప్రజల సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ అనేక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా దోమలగూడలోని ఇందిరాపార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కును రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్ బొంతు రామ్మోహన్‌ ఆదివారం ఉదయం ప్రారంభించారు.ఆక్యుప్రెజర్‌ పద్ధతిలో ఎనిమిది అంశాలతో ఈ పార్కును సిద్ధం చేశారు. ఎకరం విస్తీర్ణంలో సర్కిల్‌ పద్ధతిలో ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలలో ఒత్తిడిని కలిగించేందుకు 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్‌ స్టోన్స్‌, 6 ఎం.ఎం చిప్స్‌, ఇసుక , చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, వాటర్‌ బ్లాకులను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. ఈ సర్కిల్‌కు అన్ని వైపులా 40 రకాల ఔషధ మొక్కలను పెంచటం విశేషం. మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్‌ నుంచి క్రమ పద్ధతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్‌ వైపు నడవటం వల్ల రక్త ప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *