Breaking News

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలి : డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

ప్రతి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పంచాయతీ ఎన్నికలపై నందిగామ మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం

తెలుగు తేజం, నందిగామ : పంచాయతీ ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నందిగామ మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని, ప్రజలంతా మన వైపే ఉన్నారని, పంచాయతీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మేంటో నిరూపించాలన్నారు. అనంతరం నందిగామ మండలంలోని పలు గ్రామాలకు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులను పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఎంపిక చేసి ప్రకటించారు. ప్రత్యర్ధులకు నామినేషన్ వేయటానికే అభ్యర్థులే లేరని, మెజారిటీ గ్రామాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నించాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *