Breaking News

‘పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసు : మంత్రి కొడాలి నాని

టీడీపీ ఒక ఫేక్‌ పార్టీ చంద్రబాబు ఫేక్‌ ప్రతిపక్షనేత

తెలుగు తేజం, అమరావతి : అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? అసలేమైంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా మంత్రి నాని మాట్లాడుతూ.. టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పారిపోయేవాళ్లెవరో తెలుసు!

‘టీడీపీ హయాంలో మీరు ఎంతిచ్చారో మాకు తెలుసు. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి. చంద్రబాబు 9ఏళ్ల పాలనలో పెన్షన్‌లో రూపాయి పెంచలేదు. బాబు హయాంలో ఉన్న వాళ్లు ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్సార్ భరోసా పథకం కింద అర్హులకు పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. ఎవరో ఒకరి పొత్తు లేకుండా పోటీచేయలేని వ్యక్తి చంద్రబాబు. చేసిన తప్పులను చంద్రబాబు సరిదిద్దుకోవాలి. పారిపోయే వారు ఎవరో ప్రజలకు తెలుసు. 1983లో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు పారిపోయారు. అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ వదిలి పారిపోయారు. కరోనా రాగానే కాల్వ గట్టు వదిలి పారిపోయారు. మా ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తోంది. వైఎస్ఆర్ భరోసా పథకం ద్వారా అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నాం. ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు పింఛన్లు ఇవ్వనున్నాం. చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నాయకుడు. టీడీపీ ఫేక్ పార్టీ. చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి. బాబే గాలి నాయకుడు. పారిపోయేవాళ్లెవరో ప్రజలందరికీ తెలుసు’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *