Breaking News

పేకాట శిబిరం పై పోలీసుల దాడి

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జోరుగా సాగుతోన్న పేకాట శిబిరంపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని అగ్రహారంలో పేకాట ఆడతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 70 వేలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *