Breaking News

సత్యం మాస్టారుకు మధుర కవిభూషణ పురస్కారం

తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలు కు చెందిన ఉపాధ్యాయ రచయిత ముక్కా సత్యనారాయణకు తెలంగాణ రాష్ట్ర పెద్దపల్లి జిల్లాకు చెందిన మేఘన సాహితి కళావేదిక వారు మధుర కవిభూషణ పురస్కారం అందించారు. వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయనకు పురస్కారం అందించడం జరిగింది. విజయనగరం జిల్లాకు చెందిన సాహిత్య సృజన వారు కూడా సత్యనారాయణకు సృజనశ్రీ పురస్కారం అందించడం జరిగింది. గత ఏడాది పదిహేను పురస్కారాలను రికార్డు స్థాయిలో పొందిన సత్యనారాయణ ఈ ఏడాది ఇప్పటికే మూడు పురస్కారాలను పొందడం పట్ల రచయితలు ఈర్ల సమ్మయ్య , అడిగొప్పుల సదయ్య , జామి సత్యనారాయణ, హకీమ్ , శీనమ్మ, రిషికుమార్, నరేష్ , స్థానిక నేతలు వేల్పుల రవికుమార్, ఇంజం కేశవరావు , కాకాని శ్రీనివాసరావు, వాసిరెడ్డి బెనర్జీ తదితరులు అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *