Breaking News

రధసప్తమి విశిష్టత అమోఘం

తెలుగు తేజం, జగ్గయ్యపేట : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల వెంకట లక్ష్మి నారాయణ ‘రథసప్తమి” శుభ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో మహిళలకు జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పంపిణీ చేయడం జరిగినది.అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల వెంకట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగిపళ్ళు మనము తలంటు స్నానం చేసేటప్పుడు మన తలపై పెట్టుకొని స్నానం చేయటం వలన ఆ బ్రహ్మదేవుడు మనం కోరిన కోరికలను నెరవేరుస్తారని ఆ భగవంతుడికి కృప పాత్రులు గా ఉంటానని అన్నారు.పూర్వకాలం అనుభవాలను ఇప్పటి తరాలకు తెలియజేయుట కొరకు ఈ కార్యక్రమమును ఏర్పాటు చేయడం జరిగినది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *