Breaking News

ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద

కృష్ణా: ఎగువ నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అధికారులను అప్రమత్తం చేశారు. నివాస ప్రాంతాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని… సహాయక చర్యల్లో అధికారులకు సహకరించి…. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. మరోవైపు వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. . ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,09,770, అవుట్ ఫ్లో 5,06,604 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 6,46,747, అవుట్‌ ఫ్లో 5,34,933 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని.. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *