Breaking News

ప్రజల హృదయాల లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు : మాజీ మంత్రి దేవినేని ఉమా

తెలుగు తేజం , కంచికచర్ల : ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు, తంగిరాల ప్రభాకర్ రావు, దేవినేని వెంకటరమణ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ గా ఉన్నారని, అందుకే ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం పొందారన్నారు. నేడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.ముఖ్యంగా యువత ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి ఆయన అడుగుజాడలలో నడిచి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా రక్త దాన కార్యక్రమం నిర్వహించారు దీనిలో యువకులు నాయకులు , ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేమా వెంకట్రావు , గుత్తా రత్నం, ఓంకార్, గొర్రెపాటి ప్రభాకర్ యాదాల శీను, ఫణి, రమేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *