Breaking News

ప్రతిస్టాత్మక మన తెలుగు తేజం అవార్డుకు ఎంపికైన చారుగుండ్ల

తెలుగుతేజం జగ్గయ్యపేట : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చారుగుండ్ల వెంకట లక్ష్మి నారాయణకు “మన తెలుగు తేజం జాతీయ అవార్డు 2021” పురస్కారము ప్రకటించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ మరియు సెక్రటరీ పసుమర్తి మల్లికార్జునరావు మహిళా అధ్యక్షురాలు రాఘవ జయ శ్రీ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో మొదటి వ్యక్తిగా మన తెలుగు తేజం అవార్డు కు ఎంపికకావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు సేవా కార్యక్రమాలతో నిత్యము అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించటం వల్ల వారికి ఈ అవార్డు దక్కిందని ఇలా సేవా కార్యక్రమాలు చేసేవారు చాలా అరుదుగా ఉంటారని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించుకొని అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉన్నటువంటి అని, ఇటువంటి వ్యక్తి మా ఆర్యవైశ్య జాతిలో పుట్టటం మా జాతికే గర్వకారణమని, ఆయనను అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *