Breaking News

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి:- నందిగామ సీఐ కనకారావు


తెలుగు తేజం,నందిగామ: నందిగామ పట్టణంలో ఈ నెల 10వ తేదీన జరుగు నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నందిగామ సీఐ కనకారావు తెలిపారు. శనివారం సాయంత్రం నందిగామ సీఐ కనకారావు నందిగామ రూరల్ సీఐ సతీష్ ఎస్ ఐ లు హరి ప్రసాద్ తాతాచార్యులు వారి సిబ్బందితో కలిసి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు ఈనెల పదో తేదీన జరుగు నగర పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇటువంటి దాడులు ప్రతి దాడులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని అలాగే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందరూ పోలీసువారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందిగామ సిఐ కనకారావు నందిగామ రూరల్ సీఐ సతీష్ నందిగామ ఎస్సైలు హరిప్రసాద్ తాతాచార్యులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *