Breaking News

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు ప్రోత్సహం-వైస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు :ముక్కపాటి శివాజీ

తెలుగు తేజం నందిగామ:నందిగామ నగర పంచాయతీ ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున మున్సిపల్ ఎన్నికలకు పోటీచేయుచున్న అభ్యర్థులను కలసి విజయం సాధించాలని ఆశిస్తూ, 20 వార్డులలోని అభ్యర్థులకు వైస్సార్సీపీ కృష్ణాజిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముక్కపాటి శివాజి పార్టీ కండువా కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని, దానికి నిదర్శనం మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో 90 శాతం పైగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను గెలిపించారని, నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *