Breaking News

రెస్టారెంట్‌లో పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు

విజయవాడ తెలుగు తేజం: విజయవాడ అ నగరంలోని బార్బీక్యూ నేషన్‌ రెస్టారెంట్‌లో పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. కనీసం కోవిడ్‌ నిబంధనలు‌ పాటించకుండానే రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. అనంతరం విజిలెన్స్‌ ఎస్పీ కనకరాజు, విజయవాడ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు మీడియా మాట్లాడారు. ‘నిల్వ ఉన్న 1500 కిలోల మటన్‌ను గుర్తించాం. ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నారు.  ఎంతోకాలంగా నిల్వ ఉంచిన హల్వాను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. హోటల్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. రెస్టారెంట్‌లోకొన్ని సాంపిల్స్ సేకరించాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి రిపోర్టుల ఆధారంగా రెస్టారెంట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ అధికారులు అశోక్‌రెడ్డి, ఎం.వెంకటేశ్వరరావు, ఆహార తనిఖీ అధికారులు రమేష్‌బాబు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *