Breaking News

ఆయువు తీసిన అంబులెన్సు ఆలస్యం

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో శరీర భాగాలు తెగిపడి ఆ యువకుడు నరకయాతన అనుభవించారు. మానవతా హృదయులు స్పందించి ఎండనుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించినప్పటికీ ఫలితం దక్కలేదు. గంటకుపైగా ఆలస్యంగా అంబులెన్సు సేవలందడం పరిస్థితిని చేయి దాటేలా చేసింది. కొనప్రాణం వరకు కొట్టుకుంటూ తనువు చాలించారు. ఈ హృదయ విదారక సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు ఏడీబీ రోడ్డులో సోమవారం కనిపించింది. కాకినాడ రాజేంద్రనగర్‌కు చెందిన వింజుమళ్ల విజయ్‌(25) రంగంపేట మండలం ఎస్‌టీరాజాపురం గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే మండలంలో పని చేస్తున్న ఓ యువతితో కలిసి సోమవారం ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా ఉండూరు ఏడీబీ రోడ్డు కూడలి వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమెను ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తరలించారు. విజయ్‌ని అలా తీసుకెళ్లే పరిస్థితి లేక గంట తర్వాత అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నమూశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *