Breaking News

బీహార్ రెండో దశ ఎన్నికలు ప్రారంభం

పట్నా: బిహార్‌లో మూడు విడతల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కీలకంగా చెబుతున్న రెండో దశ ఓటింగ్‌ ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థి అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(రాఘోపుర్‌), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌(హసన్‌పుర్‌) పోటీ చేస్తున్న స్థానాల్లో నేడే పోలింగ్‌ జరుగుతోంది. నీతీశ్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నంద్‌ కిశోర్‌ యాదవ్‌-భాజపా(పట్నా సాహెబ్‌), శ్రవణ్‌కుమార్‌-జేడీయూ (నలంద), రామ్‌సేవక్‌ సింగ్‌-జేడీయూ(హథువా), రాణా రణ్‌ ధీర్‌ సింగ్‌-భాజపా(మధుబన్‌)ల భవితవ్యాన్నీ ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *