Breaking News

బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 116వ వర్ధంతి

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం: భారత దేశపు రెండవ ప్రధాని గాంధీ నెహ్రూల కు అత్యంత ప్రీతి పాత్రుడు, సన్నిహితుడు అయినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 116వ వర్ధంతిని బీసీ సమన్వయ కమిటీ మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో స్థానిక రాయల్ బిలియంట్స్ హైస్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా కమిటీ అధ్యక్షుడు నిడుముక్కల శివశంకరరావు పాల్గొని లాల్ బహదూర్ శాస్త్రి నిడారంబరతను గురించి కొనియాడుతూ ఆయన చెప్పిన జై జవాన్, జై కిసాన్ నినాదం ను గుర్తు చేసి నేడు అమలు చేయాల్సిన విధానం గురించి వివరించారు.

అనంతరం బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మల్లికార్జున రావు, శ్యాంసుందర్, యశ్రీన్ నాగేశ్వరావు ,పార్వతి, వెంకటేశ్వరరావు మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *