Breaking News

బ్లేడ్‌ బ్యాచ్‌ దురాగతం

తెలుగు తేజం, తాడేపల్లి, : బ్లేడ్‌ బ్యాచ్‌ మరోసారి చెలరేగింది. తాడేపల్లి మండలం మెల్లెంపూడి డొంకలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకరిపై తీవ్రంగా దాడి చేసింది. విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన అచ్యుతరావును కొంతమంది ద్విచక్ర వాహనంపై ఇక్కడకు తీసుకొచ్చి బ్లేడుతో దాడికి పాల్పడ్డారు. అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అతనిని 108 అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు. అపస్మారక స్థితి నుంచి అతను బయట పడితేగానీ అతనిని తీసుకొచ్చిందెవరు? దాడి చేసింది ఎవరు అనేది తేలుతుందని పోలీసులు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *