Breaking News

భక్తులు జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

తెలుగు తేజం, విజయవాడ : కరోనా వ్యాప్తిలో ఉన్నందున కార్తీకమాసం దృష్ట్యా భక్తులందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎండి రియాజ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులకు సూచనలు జారీ చేస్తూ ఆదివారం విజయవాడ లో ఒక ప్రకటన విడుదల చేశారు. కార్తీకమాసం పేరుతో ఆలయాల వద్ద అధిక రద్దీ ఉండకుండా చూడాలని కోరారు. అధిక రద్దీ ప్రదేశాల వద్ద కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు సాధ్యమైనంత వరకూ పూజలు ఇంటివద్దే నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో జీవించాలని చేసుకునే పూజలు కుటుంబం కరోనా బారిన పడకుండా చూసుకోవాలన్నారు. చలికాలం లో వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉండడంవల్ల రెండో దశ వ్యాప్తి జరుగుతుందని ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్న సూచనలు అందరూ అవగాహన చేసుకొని వీటిని దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉండి కార్తీక మాస పూజలు నిర్వహించుకోవాలని, బయటకు వెళ్లేముందు ఒకసారి ఆలోచించి మాస్క్ ధరించడం మర్చిపోవద్దని భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీపాలు వెలిగించే ముందు చేతులకు శానిటైజర్ రాసుకో వద్దని ఆయన తెలిపారు రక్షిత చర్యలు చేపట్టి కుటుంబ యావత్తు ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *